*యక్షిణి కుందెళ్ళు:-*
ఏ ఇంట్లో అయితే వివాహానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయో ఆ ఇంట్లో ఒక మగ , ఆడ కుందేలును స్వచ్చమైన తెల్లగా ఉన్న కుందేలును తీసుకుని వచ్చి ఆ రెండింటికీ వివాహం చేస్తారు ఇది కేరళ తంత్రం . పెళ్లి చేసిన తర్వాత ఆ కుందేలును ఆ ఇంటివారికి ఇస్తారు . కుజదోషం ఉంటే ఎర్రని పదార్థాలు ఆ కుందేలుకు ఆహారంగా పెట్టాలి. రాహు కేతువుల దోషం ఉంటే భూమిలో నుంచి వచ్చే దుంపలను ఆహారం పెట్టండి. శుక్రదోషం ఉంటే తెల్లని పదార్థాలు, తీపి పదార్థాలు ఎక్కువగా వేయాలి. బుధగ్రహదోషం ఉంటే ఆకుపచ్చని గడ్డి లేదా పెసలను నానబెట్టి ఆహారంగా వెసి పెంచమని చెబుతారు. ఇలా చేయడం వల్ల మూడు నెలల కాలంలోనే వివాహం కుదిరి సంతోషంగా దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తారు . అనతి కాలంలోనే చక్కని సంతానం కలుగుతుంది.యక్షిణీ కుందేలు దొరకని వారు అటువంటి కుందేలు బొమ్మలను రెండింటినీ తీసుకుని వచ్చి బొమ్మల పెళ్ళి చేయవచ్చు. నల్ల ఇరుగుడు చెక్కతో గానీ , ఎర్రచందనం చెక్క తో గాని చేసినటువంటి బొమ్మలకు వివాహం చేసి ఆ ఇంట్లో పెడితే శుభకార్యాలు జరుగుతాయి. ఇది కేరళలో ఉన్న చాలా పురాతనమైన తంత్ర ప్రక్రియ.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి