🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*ఆచార్య సద్బోధన:*
➖➖➖✍️
*చెప్పులు లేకుండా...*
*దేవాలయంలోకి ప్రవేశించే ముందు పాదరక్షలు బయటే విడిచి, కాళ్లు కడుక్కోవాలనేది మన సంప్రదాయం. ఈ నియమంలో ఆరోగ్యం, ఆధ్యాత్మికత ఇమిడి ఉన్నాయి.*
*గుడి ప్రాంగణాన్ని పవిత్రంగా భావించా లనేది ముఖ్య కారణం. ఆ సంగతలా ఉంచితే ఆలయంలో మంత్ర పూర్వకంగా స్థాపించిన యంత్రాల వలన గుడిలో అనుకూల శక్తి వ్యాపించి ఉంటుంది.*
*స్వయంభూ దేవాలయాలైతే విగ్రహాలను ప్రతిష్టించినవారి దైవిక శక్తి, తపశ్శక్తి తదితర శక్తుల సమాహారంతో ఆ నేల భాగం అయస్కాంత శక్తితో ప్రేరేపితమై ఉంటుంది.*
*ఆ శక్తుల ప్రభావం మన శరీరంలోకి ప్రవహించడం ఆరోగ్యప్రదం. అందుకు ప్రధాన వాహకాలు పాదాలే. భూమి నుంచి వెలువడే సానుకూల తరంగాలను స్వీకరించే శక్తి పాదాల్లోనే ఉంటుంది.*
*అంటే పాదాలు మనిషి లోని సర్వ శక్తులకూ ఆలంబనలు. వివిధ శరీర భాగాల్లోని నాడుల చివరలు పాదాల్లో ఉంటాయి. చెప్పులు లేకుండా నడవడం వల్ల ఆ నాడులన్నీ ఉత్తేజితమై ఆరోగ్యం బాగుంటుంది.*
*అలాగే ఆలయ పరిసరాల్లో ఉండే పూలమొక్కలూ, ఔషధ వృక్షాలూ కూడా అనుకూల శక్తిని వ్యాప్తి చేస్తాయి.*
*ఇక విగ్రహాన్ని అభిషేకించిన జలాదులతో పవిత్రమయ్యే నేలపై పాదాన్ని మోపడం వల్ల భక్తుడు అనుకూల శక్తి పొందుతాడు.*
*లౌకికంగా చూస్తే... పాదరక్షలు ధరించకపోవడం వల్ల గర్వం, అహం లాంటివి తొలగిపోతాయి.*
*ఇలా మానసిక, శారీరక శ్రేయస్సు కోసం చేసిన ఏర్పాటిది. ప్రస్తుతం చేస్తున్న అయస్కాంత చికిత్స ప్రాచీన కాలంలోనే ఉండేది. అందువల్లే పాదరక్షలు లేని పాదాలతోనే ఆలయంలో ప్రవేశించాలన్నారు.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి