29, డిసెంబర్ 2022, గురువారం

కలశం పైన కొబ్బరికాయ ఏమి చేయాలి?

*కలశం పైన కొబ్బరికాయ ఏంచేయాలి ?*

సాధారణంగా కలశాన్ని నోములు, వ్రతాలు చేసుకొనే సమయంలో పెడుతూ ఉంటాం. ఆ కలశాన్ని షోడశోపచార పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తాం . ఆ తర్వాత ఆ కలశంలోకి ఆవాహన చేసిన దైవానికి ఉద్వాసన చెప్పాక , కలశం పైనున్న కొబ్బరికాయని ఏంచేయాలనేది సందేహం.

*దైవంగా భావించి పూజించిన కాయని కొట్టుకుని తినొచ్చా ? పచ్చడి లాంటి పదార్థాలు చేసుకోవచ్చా ?*
అని సందేహాలుంటాయి .
*వాటికి సమాధానాన్ని వెతుక్కునే చిరుప్రయత్నమే ఇది* 

కలశంలోని కొబ్బరికాయ భగవంతుని స్వరూపానికి ప్రతీక. *కాయ పైనుండే పొర - చర్మం. పీచు - మాంసం. దృఢంగా ఉండే చిప్ప- ఎముకలు. అందులో ఉండే కొబ్బరి -మనిషిలోని ధాతువు. కాయలోని నీళ్లు - ప్రాణాధారం. పైన ఉండే మూడు కన్నులే - ఇడ, పింగళ, సుషుమ్న నాడులు. జుట్టు- అఖండమైన జ్ఞానానికీ, అహంకారానికీ ప్రతీక. స్వయంగా ఆ పరమేశ్వరుడే తనకి ప్రతి రూపంగా కొబ్బరికాయని సృష్టించారు . ఇటువంటి ప్రత్యేకలని కలిగిఉండడం వల్లనే కొబ్బరికాయ పరమాత్మ స్వరూపమై పూజలందుకోవడానికి అర్హతని సంపాదించుకోగలిగింది*.

కలశాన్ని స్థాపించేప్పుడు , వారి తాహతును బట్టి రాగిచెంబు లేదా వెండి చెంబును కలశంగా వుంచి, దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి, ఆ కలశంలో కొంచెం నీరు పోసి అక్షింతలు, పసుపు, కుంకుమలు, గంధం, పూలు వేస్తారు. కలశంపై మావిడి ఆకులు చుట్టూ ఉండేలా పెట్టి, వస్త్రం చుట్టిన కొబ్బరికాయను పెట్టి పూజ చేస్తారు. అప్పుడు దీనిని *“పూర్ణకుంభము”* అని పిలుస్తారు . అది దివ్యమైన ప్రాణశక్తితో నింపబడిన జడ శరీరానికి ప్రతీక అవుతుంది. ప్రాణశక్తి వలననే అన్ని అద్భుతమైన పనులను చేసే శక్తి శరీరానికి వస్తుంది. ఇలా కలశాన్ని స్థాపన చేసే నేపధ్యానికి సంబంధించి ఒక గాథని మన పురాణాలు చెబుతాయి . 

*సృష్టి ఆవిర్భావానికి ముందు శ్రీ మహావిష్ణువు పాల సముద్రములో తన శేషశయ్య పై పవ్వళించి ఉన్నాడు. అతని నాభి నుండి వెలువడిన పద్మములో నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించి ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. అప్పుడు ఆయన తొలుత కలశస్థాపన చేశారు.* ఆవిధంగా కలశంలొని నీరు సర్వ సృష్టి ఆవిర్భవానికి ప్రథమ జాతమైన నీటికి ప్రతీకగా నిలుస్తుంది. ఇది అన్నింటికీ జీవన దాత. లెక్కలేనన్ని *నామరూపాలకి, జడ పదార్థాలకి ,చరించే ప్రాణుల యొక్క అంతర్గత సృష్టికర్త.* 

ఇక కలశంలో ఉంచిన *ఆకులు, కొబ్బరికాయ సృష్టికి ప్రతీక.* చుట్టబడిన *దారము సృష్టిలో అన్నింటినీ బంధించే 'ప్రేమ'ను సూచిస్తుంది*. అందువల్లనే 'కలశం' శుభసూచకంగా పరిగణింపబడి పూజింపబడుతున్నది.

అన్ని పుణ్య నదులలోని నీరు, అన్ని వేదాలలోని జ్ఞానము మరియు దేవతలందరి ఆశీస్సులు కలశంలోకి ఆహ్వానించబడిన తరువాత అందులోని నీరు *"అభిషేకము''* తో సహా అన్ని వైదికక్రియలకి వినియోగింప బడుతుంది. దేవాలయ కుంభాభిషేకములు ఎన్నో రకాల పూజలు కలశజలముల అభిషేకాలతో విశిష్ట పద్దతిలో నిర్వహిస్తారు. *పాల సముద్రాన్ని రాక్షసులు, దేవతలు మధించినపుడు అమరత్వాన్ని ప్రసాదించే అమృత కలశంతో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి 'కలశం' అమృతత్వాన్ని కూడా సూచిస్తుంది.* 

ఇంట్లో ఇటువంటి *కలశానికి వినియోగించిన కొబ్బరికాయని పూజ చేయించటానికి వచ్చిన బ్రాహ్మణులకు ఇవ్వచ్చు.* దీన్ని *పూర్ణఫల దానం* అని కూడా అంటారు. ఒకవేళ అలా అవకాశం లేకపోతె, పారే నీటిలో నిమజ్జనం చేయవచ్చు. *కొబ్బరికాయను బ్రాహ్మణులకు ఇచ్చిన లేదా పారే నీటిలో నిమజ్జనం చేసిన ఎటువంటి దోషాలు ఉండవు.* 

*దేవాలయంలో కలశాన్ని పెడితే పూర్ణాహుతి చేస్తారు.*

అదన్నమాట ఈ సంప్రదాయంలోని విశేషం. అంతేకానీ, కొబ్బరి పచ్చడి చేసుకుంటే బాగుంటుందని కొట్టుకుని పచ్చడి చేయకండి . ఇక సందేహాలు పక్కనపెట్టి చక్కగా ఆ విధంగా చేసి, మీ పూజలు, వ్రతాల సంపూర్ణ ఫలాన్ని ఆనందంగా పొందండి . శుభం . 

*లోక సమస్తా సుజనో భవతు*
*సర్వే సుజనా సుఖినో భవతు*

esophagus (ఆరోగ్యం)

*ఎసోఫెగస్* 

(Esophagus ) అనేది మన గొంతుని పొట్టకు కలిపేటువంటి ఒక ట్యూబు. ఇది కండరాలతో నిర్మితమై వుండి, ఎప్పుడూ మూసుకునే ఉంటుంది. ఆహారం లోనికి తీసుకునేటప్పుడు మాత్రం తెరుచుకుని మళ్ళీ వెంటనే మూసుకుపోవాలి. అలా మూసుకుని జీర్ణాశయంలో ఉన్న ఏసిడ్, ఆహారాలను బయటకు రాకుండా ఆపి రక్షిస్తూ ఉంటుంది. ఏసిడ్ బయటకి లీక్ అయ్యి వస్తే దాన్నే మనం ఎసిడిటీ అంటాము. 

భోజనం చేసే ముందు ఈ ఎసోఫెగస్  సాఫీగా తెరుచుకోవడానికి బ్రాహ్మణులు చేసే "ఆచమనం" అనే పద్దతిని అందరూ పాటించాలి. పరిశీలిస్తే ఈ ఆచమనం అనే ప్రక్రియ ఒక శాస్త్రీయ దృష్ఠితో అలవరచుకున్న ఆరోగ్యకరమైన విధానం అని తెలుస్తుంది. కొందరు అనుకున్నట్టు ఒక మూఢాచారం కాదు. కొంచెం నీరు తీసుకుని ఆహారం మొదలుపెడితే  ఎసోఫెగస్‌కి లూబ్రికేషన్ జరుగుతుంది, ఆహారం సాఫీగా పొట్టలోకి జారుతుంది. అంతేనా? ఆలాగైతే ముందుగా కాస్త నీళ్ళుతాగి భోజనం చెయ్యమని చెప్పచ్చుగా? కేశవ నామాలు దేనికి అని అనుమానం రావచ్చు. ఈ ఆచమనం భోజనం చేసే ముందే కాదు, ఏ పూజచేసేటప్పుడైనా కూడా చేస్తారు.   అన్నిటికీ కలిపి ఒకే ప్రాసెసుని మనకు నేర్పారు అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. 

గొంతులో ఎసోఫెగస్ ఒక్కటే కాదు. సున్నితమైన శ్వాసనాళము, స్వరతంతంత్రులు వంటివి అనేకం ఉంటాయి. మంత్రోచ్చారణ చేయడానికి ముందు వాటికి కూడా కొంచెం ఒక నిర్ధిష్థపద్దతిలో వ్యాయామం (వార్మ్ అప్) అవసరం. దానికి భగవన్నామాలతో మొదలు పెట్టమన్నారు. అదీ ఏ నామం పడితే అది అని చెప్పలేదు. కేశవ, నారాయణ, మాధవ అని మాత్రమే అనమన్నారు. 

ఎందుకంటే, "కేశవ" నామం గొంతులోనుంచీ వస్తుంది. "నారాయణ" నామం నాలిక సహాయంతో వస్తుంది. "మాధవ" నామం పెదాల సహకారంతో వస్తుంది.  అంటే నోటిలో అన్ని భాగాలకూ ఒక ఎక్సర్సైజు అన్న మాట.

మరి నీళ్ళు చేతిలో పోసుకుని నోట్లో ఎందుకు పోసుకోవాలి? ఉద్ధరిణితో నేరుగా నోట్లో పోసుకోవచ్చుకదా? మన చేతిలో ఎప్పుడూ కొంత విద్యుత్తు (స్టాటిక్ పవర్) ఉంటుంది. ఆ చేతితో నీరు పోసుకుని మింగితే, దానితో చేతిలో ఉన్న విద్యుత్తు, నోటిలోకి పొట్టలోకి ప్రవహించి  అన్నిటినీ ఉత్తేజపరచి, సమతుల్యం చేస్తుంది. దానితో ఆహారం స్వీకరించడం తేలికవుతుంది. అలాగే కంఠంలో ఉన్న స్వరతంతంత్రులు కూడా ఉత్తేజితం అవుతాయి. ఇది ఒక దృక్పదం. కొందరు మరొక విధంగా చెప్పవచ్చు. కానీ ఈ విధానంలో ఒక శాస్త్రీయత (మనకి పూర్తిగా అర్థం కాకపోయినా) కనిపిస్తుంది.

ఇలాగే ఇంకా మనలో చాలా ప్రశ్నలు సహజంగానే రావచ్చు. వస్తాయి. రావాలి. ఐతే అన్నిటికీ మనకు సమాధానం వెంటనే దొరుకకపోవచ్చు. అంటే దాని వెనుకనున్న నాలెడ్జిని మనం కోల్పోయాము. కనుక తిరిగి సంపాదించుకోవాలి అని ప్రయత్నిస్తే, సమాధానాలు అన్నీ ఒకరోజుకి దొరుకుతాయి. 

PS: ఒక శాస్త్రీయవిధానాన్ని సింపులుగా మూఢనమ్మకం అని కొట్టేయడాన్ని మించిన మూఢనమ్మకం మరొకటి వుండదేమో.

17, ఏప్రిల్ 2022, ఆదివారం

హనుమాన్ చాలీసా ఎప్పుడు వ్రాయబడిందో తెలుసా?

హనుమాన్ చాలీసా ఎప్పుడు వ్రాయబడిందో తెలుసా? 
ప్రతి ఒక్కరూ పవన్‌పుత్ర హనుమాన్ జీని ఆరాధిస్తారు మరియు హనుమాన్ చాలీసాను కూడా పఠిస్తారు, అయితే ఇది ఎప్పుడు వ్రాయబడింది, ఎక్కడ మరియు ఎలా ఉద్భవించిందో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.
విషయం 1600 AD నాటిది, ఈ కాలం అక్బర్ మరియు తులసీదాస్ జీ కాలంలో జరిగింది.
ఒకసారి తులసీదాస్ జీ మధురకు వెళుతుండగా, రాత్రి పొద్దుపోయేలోపు ఆగ్రాలో ఆగాడు, తులసీదాస్ జీ ఆగ్రాకు వచ్చారని ప్రజలకు తెలిసింది. ఇది విన్న జనం ఆయన దర్శనం కోసం ఎగబడ్డారు. అక్బర్ చక్రవర్తికి ఈ విషయం తెలియగానే, ఈ తులసీదాసు ఎవరు అని బీర్బల్‌ని అడిగాడు.

అప్పుడు బీర్బల్ చెప్పాడు, అతను రామచరిత్ మానస్ అనువదించాడు, ఇతను గొప్ప రామభక్తుడు, నేను కూడా అతనిని చూసి వచ్చాను. అక్బర్ కూడా ఆయన్ను చూడాలనే కోరికను వ్యక్తం చేస్తూ, నాకు కూడా ఆయన్ను చూడాలని ఉందని చెప్పాడు.
అక్బర్ చక్రవర్తి తన సైనికుల బృందాన్ని తులసీదాస్ జీ వద్దకు పంపి, మీరు ఎర్రకోటకు హాజరుకావాలని చక్రవర్తి సందేశాన్ని తులసీదాస్ జీకి తెలియజేశాడు. ఈ సందేశాన్ని విన్న తులసీదాస్ జీ నేను శ్రీరాముని భక్తుడిని, చక్రవర్తికి మరియు ఎర్రకోటతో నేను ఏమి చేయాలి అని చెప్పాడు మరియు ఎర్రకోటకు వెళ్లడానికి స్పష్టంగా నిరాకరించాడు. ఈ విషయం అక్బర్ చక్రవర్తికి చేరినప్పుడు, అతను చాలా బాధపడ్డాడు మరియు  కోపంతో ఎర్రబడ్డాడు, తులసీదాస్ జీని గొలుసులతో బంధించి ఎర్రకోట తీసుకురావాలని ఆదేశించాడు.
తులసీదాస్ జీ గొలుసులతో కట్టబడిన ఎర్రకోటకు చేరుకున్నప్పుడు, అక్బర్ మీరు ఆకర్షణీయమైన వ్యక్తిలా కనిపిస్తున్నారు, కొంచెం తేజస్సు చూపించండి అని చెప్పాడు. నేను శ్రీరాముడి భక్తుడిని మాత్రమేనని, మీకు ఎలాంటి చరిష్మా చూపించగల మాంత్రికుడిని కాను అని తులసీ దాస్ అన్నారు. అది విన్న అక్బర్ ఆగ్రహించి, వారిని గొలుసులతో కట్టి చెరసాలలో వేయమని ఆదేశించాడు.
రెండవ రోజు, లక్షలాది కోతులు ఏకకాలంలో ఆగ్రాలోని ఎర్రకోటపై దాడి చేసి మొత్తం కోటను నాశనం చేశాయి.
భయాందోళనలు కలిగాయి, అప్పుడు అక్బర్ బీర్బల్‌ని పిలిచి,  ఏమి జరుగుతోందని అడిగాడు, అప్పుడు బీర్బల్ అన్నాడు, హుజూర్, మీరు తేజస్సును చూడాలనుకున్నారు కదా, చూడండి. అక్బర్ వెంటనే తులసీదాస్ జీని చెరసాల నుండి బయటకు రప్పించాడు. మరియు గొలుసులు తెరవబడ్డాయి. తులసీదాస్ జీ బీర్బల్‌తో మాట్లాడుతూ నేను నేరం లేకుండా శిక్షించబడ్డాను.

నేను చెరసాలలో ఉన్న శ్రీరాముడు మరియు హనుమంతుడిని గుర్తుచేసుకున్నాను, నేను ఏడుస్తున్నాను. మరియు ఏడుస్తూ, నా చేతులు వాటంతటవే ఏదో రాసుకుంటున్నాయి. ఈ 40 చౌపాయ్‌లు హనుమాన్ జీ స్ఫూర్తితో వ్రాయబడ్డాయి.
జైలు నుంచి విడుదలైన తర్వాత తులసీదాస్ జీ మాట్లాడుతూ, నన్ను జైలు కష్టాల నుంచి గట్టెక్కించి హనుమంతుడు ఎలా సహాయం చేశారో, అదే విధంగా, ఎవరు కష్టాల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నారో, ఇలా పారాయణం చేసినా అతని బాధలు, కష్టాలు అన్నీ తీరిపోతాయి. దీనిని హనుమాన్ చాలీసా అని పిలుస్తారు.
అక్బర్ చాలా సిగ్గుపడ్డాడు మరియు తులసీదాస్ జీకి క్షమాపణలు చెప్పాడు మరియు అతనిని పూర్తి గౌరవం మరియు పూర్తి రక్షణతో,  మధురకు పంపాడు.
ఈరోజు అందరూ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారు. మరియు హనుమంతుని దయ వారందరిపై ఉంది.
మరియు అందరి కష్టాలు తొలగిపోతాయి. అందుకే హనుమాన్ జీని "సంకట్ మోచన్" అని కూడా అంటారు.

* దయచేసి ఈ సంస్కారవంతమైన మరియు స్ఫూర్తిదాయకమైన పోస్ట్‌ని మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి, దయచేసి వీలైనంత ఎక్కువ షేర్ చేయండి.*


మంచి రోజు
🙏🏻🙏🏻🙏🏻

28, ఫిబ్రవరి 2022, సోమవారం

Vitamins Deficiency

Vitamins Deficiency: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పోషక పదార్ధాలు, విటమిన్స్ చాలా అవసరం. కొన్ని రకాల విటమిన్ల లోపిస్తే ఆ సంకేతాలు స్పష్టంగా కన్పిస్తాయి. శరీరంలో ఏ విటమిన్ లోపముందో ఎలా తెలుసుకోవాలో పరిశీలిద్దాం..

శరీరం వివిధ రకాల వ్యాధులతో పోరాడాలంటే వ్యాధి నిరోధక శక్తి చాలా అవసరం. మరి వ్యాధి నిరోధకశక్తి పెంపొందించాలంటే కచ్చితంగా పోషక పదార్ధాలు, విటమిన్స్, ఖనిజాలు అత్యవసరం. శరీరంలో ఇవి లోపిస్తే వివిధ రకాల సమస్యలు తలెత్తుతాయి. ఏయే విటమిన్ల లోపంతో ఏ సమస్యలు తలెత్తుతాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

ముఖ్యంగా విటమిన్ ఎ లోపముంటే కంటి సమస్య ఎదురౌతుంది. మెరుగైన కంటి దృష్టి కోసం విటమిన్ ఎ తప్పనిసరి. చీకట్లో సైతం చూసేందుకు దోహదపడే రోడాపిన్స్ ఉత్పత్తికి విటమిన్ ఎ దోహదపడుతుంది. విటమిన్ ఎ లోపముంటే..తక్కువ వెలుతులో సరిగ్గా చూడలేకోవపోవడం, చర్మం చికాకు, దురద, కళ్లు పొడిబారడం వంటివి ప్రధాన లక్షణాలుగా ఉంటాయి.

ఇక విటమిన్ బి 2, బి 6 లు శరీర కణజాలాల నిర్వహణకు ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోడానికి చాలా అవసరం. విటమిన్ బి6 నీటిలో కరిగే గుణం కలిగినది. శరీరంలో ఎంజైమ్‌ల నిర్మాణానికి దోహదపడుతుంది. ఈ విటమిన్ లోపముంటే..నోటి అల్సర్, నోటి పూత, చుండ్రు, తలపై ప్యాచెస్, స్కాల్ప్ దురదగా ఉండటం ప్రధాన లక్షణాలుగా ఉంటాయి.

విటమిన్ బి 7 అనేది మనం తినే ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది. ఎప్పటికప్పుడు రిఫ్రెష్, ఎనర్జిటిక్ ఫీలింగ్ కల్గిస్తుంది. ఈ విటమిన్ లోపిస్తే..గోర్లు సులభంగా విరిగిపోవడం, తీవ్రమైన అలసట, కండరాల్లో నొప్పి, తిమ్మిరి, చేతులు, కాళ్లలో జలదరింపు ప్రధాన లక్షణాలుగా కన్పిస్తాయి.

ఇక విటమిన్ బి 12 అనేది మెదడు, నరాలు, రక్తకణాల పనితీరును మెరుగుపర్చేందుకు ఉపయోగపడుతుంది. శరీరంలో ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాల ఉత్పత్తిలో ఇవే కీలకం. ఎక్కువగా పౌల్ట్రీ, పాల ఉత్పత్తుల్లో లభిస్తుంది. ఈ విటమిన్ లోపిస్తే..తరచూ తలనొప్పి, చర్మం లేతగా ఉండటం లేదా పసుపుగా ఉండటం, నోటిలో పగుళ్లు, వాపు, డిప్రెషన్ వంటి లక్షణాలు కన్పిస్తాయి.

విటమిన్ సి కారణంగా కణజాలాలు మెరుగ్గా ఉంటాయి. శరీరంలో జరిగే వైద్య ప్రక్రియకు దోహదపడుతుంది. గాయాలు త్వరగా మానేందుకు ఉపయోగకరం. ఇమ్యూనిటీ పెంచేందుకు ఈ విటమిన్ కీలకం. విటమిన్ సి లోపిస్తే..గాయాలు త్వరగా మానకపోవడం, డ్రై స్కాల్ప్, చర్మం పొడిగా ఉండి దురద ఉండటం, ముక్కు నుంచి రక్తం కారుతుండటం, మడమల్లో పగళ్లు రావడం ప్రధాన లక్షణాలుగా ఉంటాయి.

ఇక మరో ముఖ్యమైంది విటమిన్ ఇ. ఇది శరీరంలో ఇమ్యూనిటీ పెంచేందుకు దోహదపడుతుంది. ధమనులు గడ్డకట్టకుండా ఆపుతుంది. రక్త ప్రసరణ, గుండె ఆరోగ్యానికి చాలా అవసరం. ఈ విటమిన్ లోపిస్తే..చేతులు, కాళ్లలో చలనం లేకపోవడం, శరీర కదలిక అనియంత్రితంగా ఉండటం, బలహీనమైన కండరాలు ప్రధాన లక్షణాలుగా ఉంటాయి.

24, ఫిబ్రవరి 2022, గురువారం

గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః.....*_ _*గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః.

_*🙏గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః.....*_ _*గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః....🙏*_ 

_*ఈ శ్లోకం అందరికీ తెలుసు కానీ ఈ శ్లోకం ఎలా పుట్టింది...మొదట ఎవరు పలికారు....ఎందుకు పలికారు.....దాని వెనుక ఉన్న కథ....*_ _*🍃🌻పూర్వం కౌత్సుడు అనే పేద పిల్లవాన్ని విద్యాధరుడు అనే గురువు గారు తన ఆశ్రమానికి పిలుచుకు వచ్చి తనకు తెలిసిన అన్ని విద్యలు నేర్పాడు. ఒకసారి గురువు గారు పని మీద కొన్ని రోజులు బయటకు వెళ్ళాడు. గురువు గారు తిరిగి వచ్చేవరకు కౌత్సుడు ఆశ్రమాన్ని చక్కగా చూసుకున్నాడు.*_ _*🍃🌻గురువు గారు తిరిగివచ్చిన కొన్ని రోజులకు కౌత్సుడి చదువు పూర్తయింది. కౌత్సుణ్ణి తీసుకెళ్లాడానికి తల్లిదండ్రులు వచ్చారు. కానీ కౌత్సుడు తాను గురువు గారి దగ్గరే ఉంటానని ఇంటికి రానని ఖరాఖండిగా చెప్పి తల్లిదండ్రులను వెనక్కి పంపాడు.*_ _*🍃🌻వాళ్ళు వెళ్లిన తరువాత గురువు కారణం అడిగాడు.అప్పుడు కౌత్సుడు ఇలా చెప్పాడు "గురువు గారూ మీరు కొన్ని రోజుల క్రితం బయటకు వెళ్ళినపుడు మీ జాతకం చూసాను.మీరు సమీప భవిష్యత్తులో భయంకరమైన రోగంతో ఇబ్బంది పడతారు. అందుకే మిమ్మల్ని వదిలి వెళ్లలేను." అని చెప్పాడు.*_ _*🍃🌻కొన్ని రోజులకు గురువు గారికి క్షయ రోగం వచ్చింది.ఆ కాలంలో క్షయకు చికిత్స లేకపోవడంతో కాశీకి వెళ్లి దాన ధర్మాలు ,పుణ్య కార్యాలు చేయాలని గురుశిష్యులు కాశీకి వెళ్లారు. గురువుగారి రోగం చూసి కాశీ ప్రజలు వీళ్ళను అసహ్యించుకున్నారు. కానీ కౌత్సుడు గురువు గారికి సేవలు చేస్తూనే ఉన్నాడు.ఎంతోమంది గురువు గారిని వదిలి వెళ్ళమని సలహా ఇచ్చినప్పటికీ కౌత్సుడు మాత్రం గురువు గారిని వదలలేదు.*_ _*🍃🌻కౌత్సుడి గురు భక్తికి మెచ్చిన త్రిమూర్తులు అతన్ని పరీక్షించాలనుకున్నారు. మొదట బ్రహ్మ మారువేషంలో వెళ్లి గురువుని వదిలేయమని సలహా ఇచ్చాడు. కౌత్సుడు బ్రహ్మ చెప్పిన మాటలు వినలేదు. మరలా విష్ణువు మారు వేషంలో వచ్చి సలహా ఇచ్చినా కూడా కౌత్సుడు వినలేదు. చివరికి పరమేశ్వరుడు వచ్చినా వినలేదు. మెచ్చిన పరమేశ్వరుడు ఏదయినా సహాయం కావాలా అని అడిగాడు. మరెవరూ గురువును వదిలేయమనే సలహా ఇవ్వడానికి రాకుండా కాపలా కాయమన్నాడు.*_ _*🍃🌻అతని గురు భక్తికి మెచ్చిన త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు. కౌత్సుడికి మోక్షం ఇస్తాం అన్నారు. అప్పుడు కౌత్సుడు వారితో నాకు మీ గురించి చెప్పి ఈ రోజు మీరు ప్రత్యక్షం కావడానికి కారణమైన నా గురువే నాకు బ్రహ్మ, నా గురువే నాకు విష్ణువు, నా గురువే నాకు మహేశ్వరుడు. మీరు సాక్షాత్కారం అవడానికి కారణమైన నా గురువే పరబ్రహ్మ అని అర్థం వచ్చేలా ఇలా శ్లోకం చెప్పాడు.*_ _*గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః*_ _*గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః*_ _*🍃🌻తన గురువు గారికి మోక్షం ప్రసాదించమని వేడుకున్నాడు. గురు భక్తికి మెచ్చిన త్రిమూర్తులు గురువుగారికి మోక్షం ప్రసాదించారు. ఆనందంతో కౌత్సుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయాడు.*_ _*ఇదీ ఈ శ్లోకం వెనుక ఉన్న కథ....*_ _*కొన్ని ముఖ్య శ్లోకల విలువలు, అర్ధాలు అందరము తెలుసుకోవాలి, మనము అందరం మన తరువాత వాళ్ళకి కూడా తెలియజేయాలి*🙏☯️🕉️🌞🔱🚩

23, ఫిబ్రవరి 2022, బుధవారం

తిరుమల సమగ్ర samaacharam

👏✍️🔱
*తిరుమల సమగ్రసమాచారం మీకు ఇక్కడ ఇవ్వబడింది . మీకు కావాల్సిన సమాచారం పైన క్లిక్ చేస్తే క్షణాలలో సమాచారం ఓపెన్ అవుతుంది . మీకు ఎంతగానో ఈ సమాచారం ఉపయోగపడగలదు . ఎంతశ్రమకోర్చి ఈ సమాచారం సేకరించమో మీకు చదివితే అర్ధమౌతుంది . మీరు షేర్ చేస్తే అందరికి ఈ సమాచారం ఉపయోగపడగలదు* . 

తిరుమల శ్రీవారి మెట్టు నడక దారి :  https://goo.gl/MqM8Qg

ఇకపై అలిపిరి మెట్లమార్గం సులువు :  https://goo.gl/ahvx4f

తిరుమల చుట్టుప్రక్కల ఏమేమి చూడాలి :  https://goo.gl/azxwRV

తిరుమల కొండపైన ఏమేమి చూడాలి :  https://goo.gl/EddXiw

తిరుమల సేవలు వాటి ధరలు బుక్ చేస్కునే విధానం : https://goo.gl/1Mdeef

అంగప్రదిక్షణ వివరాలు :  https://goo.gl/6dKzrm

తులాభారం ఎలా వెయ్యాలి :  https://goo.gl/fJ5eij

తిరుమల సేవకు ఎలా వెళ్ళాలి :  https://goo.gl/o2t5Eh

తిరుమల లడ్డు మొదటి నుంచి లేదు :  https://goo.gl/JDqNq5

తిరుపతి విమానం లో వెళ్లే రోజులు వచ్చాయి :  https://goo.gl/UCvVjV  

తిరుమల మొదటి సారి వెళ్తున్నారా ? :  https://goo.gl/afNxs9

తిరుమల గురించి ఈ నిజాలు మీకు తెలుసా :   https://goo.gl/4a3tVd

తిరుమల రూమ్స్ నెట్ లో బుక్ చేస్కునే సమయం లో ఇవి గుర్తుపెట్టుకోండి :  https://goo.gl/TmNqgQ 


కపిలతీర్థం ఎలా చేరుకోవాలి :  https://goo.gl/FiYDnf


శ్రీకాళహస్తి దర్శనం తరువాత ఎక్కడికి వెళ్లకూడదా ? :  https://goo.gl/dL4oB7

కొత్త జంటకు శుభవార్త :  https://goo.gl/BT2KXA 

తిరుమల సమగ్ర సమాచారం :  https://goo.gl/s3FkjC

తిరుమల దర్శనం ముందుగా ఎవరు చెయ్యాలి :   https://goo.gl/kxtS8y  

ఈ నెంబర్ లు సేవ్ చేస్కోండి :  https://goo.gl/pEVK2R 

కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు :  https://goo.gl/32t1kA

తిరుమల వెళ్లేవారికి నా సలహా :  https://goo.gl/PkSPou

తిరుమల చుట్టుప్రక్కల చూడాల్సిన క్షేత్రాలు :  https://goo.gl/ZKa956

అరుణాచలం గురించి సమగ్ర సమాచారం :  https://goo.gl/RcYHMN

ఏడూ కొండల పరమార్ధం ఏమిటి :   https://goo.gl/igEbZq

తిరుమల వెళ్లే చంటి పిల్లల N తల్లిదండ్రులకు :  https://goo.gl/fKvyjo

గోవింద రాజుల ఆలయ చరిత్ర :  https://goo.gl/eWWVeM

*🙏🙏🙏తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో 👏👏👏*

1, ఫిబ్రవరి 2022, మంగళవారం

కూర్చొన్న స్థితిలో ఉన్న శ్రీనివాసుడిని చూశారా?

ముసలితనం కారణంగా తన వద్దకు రాలేని ఒక భక్తుడి కోసం కలియుగ దైవమైన శ్రీనివాసుడు అతని కోటకే తరలి వెళ్లారు. 
స్వయంభువుగా యోగ ముద్రలో వెలిసి ఆ భక్తుని కోరికను తీర్చారు. 
ఆయన ఎవరో కాదు తిరుమలో వెలిసిన శ్రీనివాసుడు. 
ఆ భక్తుడు ఎవరు? 
స్వామి ఎక్కడ వెలిసారు? 
ఎల్లప్పుడు నిలువెత్తు రూపంలో కనిపించే ఆ శ్రీనివాసుడు యోగ ముద్రలో అంటే సుఖాసీనుడై ఉన్న క్షేత్రం ఏమిటి తదితర వివరాలన్నీ మీకోసం.

కలియుగదైవం శ్రీనివాసుడికి పిల్లనిచ్చి పెళ్లి చేసిన ఆకాశ రాజుకు స్వయాన సోదరుడే ఈ తొండమాన్ చక్రవర్తి. శ్రీవారికి గొప్ప భక్తుడైన ఈ తొండమానుడు అగస్త్యాశ్రమంలో సేదతీరుతున్న శ్రీనివాసుడిని దర్శించుకొంటాడు. శ్రీనివాసుని ఆదేశాలను అనుసరించి తొండమానుడు విశ్వకర్మ సహాయంతో సప్తగిరుల పై శ్రీనివాసుడి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తాడు.

రత్నఖచితమైన సువర్ణ కళశాలతో ప్రకాశించే విమానాన్ని నిర్మించి దాని చుట్టూ మూడు ప్రాకారాలతో మూడు ప్రదక్షిణ మార్గాలను మూడు మండపాలను వంటశాలలను బంగారు బావిని నిర్మిస్తాడు. ఇలా ఆలయ నిర్మాణం పూర్తైన తర్వాత ప్రతి రోజూ తిరుమలకు వెళ్లి తొండమానుడు శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకొని వచ్చేవాడు.

శ్రీవారి దర్శన అనంతరమే రాజ్య వ్యవహారాలు చూసుకోవడానికి అలవాటయ్యింది. ఒక రహస్య సొరంగ మార్గం గుండా ప్రతి రోజూ తిరుమలకు వెళ్లివచ్చేవాడు. కాగా కాలక్రమంలో ముసలితనం కారణంగా తొండమానుడు తిరుమలకు వెళ్లలేకపోతాడు. దీంతో జీవిత చరమాంకంలో ఉన్నానని అందువల్ల తిరుమలకు రాలేకపోతున్నాని మొర పెట్టుకొంటాడు. దీంతో తన ఇంటనే స్వామి వెలిసి ఉండాలని ఆ కలియుగ దేవుడిని వేడుకొంటాడు.

తొండమాను చక్రవర్తి భక్తికి మెచ్చిన శ్రీ వేంకటేశ్వర స్వామి తొండమాన్ ఇంటనే స్వయంభువుగా ఉద్భవించారు. ఒక చేతితో యోగముద్ర, మరోచేతితో అభయహస్తం కలిగి ఉండటంతో పాటు శ్రీదేవి, భూదేవి సమేతుడిగ ప్రసన్న వేంకటేశ్వరుడిగా దర్శనమిస్తాడు. 

చాలా చోట్ల శ్రీవారు నిలుచున్న స్థితిలో కనిపిస్తే ఇక్కడ మాత్రం కూర్చొన్న స్థితిలో దర్శనమిస్తాడు. ప్రపంచంలో ఈ స్థితిలో వేంకటేశ్వరుడు భక్తులకు ధర్శనమిచ్చేది ఇక్కడ మాత్రమే. ఇక ఈ స్వామివారిని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.

ఇక్కడ తామరగుంట పుష్కరిణి ఉంది. తిరుమలలోని ఆకాశగంగ, కపిల తీర్థం జలపాతాల నుంచి వచ్చే నీటిని కాలువల ద్వారా తొండమనాడులోని తామరగుంట పుష్కరిణిలోకి మళ్లిస్తారు. ఈ జలాలతోనే స్వామివారికి నిత్యాభిషేకం జరుగుతుంది. 

ఈ క్షేత్రం తిరుపతికి 30 కిలోమీటర్ల దూరంలో, శ్రీకాళహస్తి పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ తొండమనాడు గ్రామం ఉంది.

 ఇక్కడికి చేరుకోవడానికి తిరుపతి శ్రీకాళహస్తి నుంచి ప్రతి అరగంటకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది.

🙏#ఓం_నమో_వేంకటేశాయ🚩.

24, జనవరి 2022, సోమవారం

సూక్ష్మం లో మోక్షం...........!!

సూక్ష్మం లో మోక్షం...........!!

ఎవరన్నా అన్నం పెట్టమని అడిగినారంటే..
మీకు  పుణ్య కాలం ప్రవేశిస్తున్నది అనీ అర్ధం, 

భగవంతుడు ఎవర్నో అడ్డం పెట్టుకొని వారి ద్వారా 
మీకు పుణ్య ఫలమును ప్రాప్తి చేస్తున్నాడు అని అర్ధం. దానిని సరిగా మనం వినియోగించుకోవాలి. 

ఇతర వర్ణముల వారి కంటే బ్రాహ్మణుడు, 
బ్రాహ్మణుడు కంటే వేద బ్రాహ్మణుడు, 
శ్రీవిద్యోపాసకుడు, 
సన్యాసి, 
వారి కంటే గోమాత 
ఇలా ఒక దాని కంటే మరొకటి కోట్ల రెట్లు ఫలమధికము.

నీవు అన్నం పెట్టడం కన్నా..
వాళ్ళు నీ ముందుకు వచ్చి అన్నం పెట్టు అమ్మా అని..
చేయి జాచితే అంత కంటే పుణ్యం ఇంకొకటి లేదు. 

ఒక గోమాత నీ ఇంటి ముందుకు వచ్చినది.. 
నీవు పిలవ కుండానే, 
వెంటనే దానికి గ్రాసం గాని, 
అన్నం కాని పెట్ట వలయును. 

పిలవక పోయినా కాకతాళీయంగా ఒక సన్న్యాసి, 
ఒక శ్రీవిద్యోపాసకుడు, 
ఒక భాగవతుడు, 
ఒక వేదమూర్తి,  
నీ ఇంటికి వచ్చాడు 
కొన్ని కోట్ల జన్మల పాపం తరిగి పోతుంది, 
నీవు గాని అతనికి ఆతిధ్యం ఇస్తే. 
కనీసంలో కనీసం కాస్త మంచి తీర్ధం. 

ఏమో ఏ శంకరాచార్యులు మారు రూపంలో వస్తాడో. యోగులు, జ్ఞానులు, బాబాలు  అన్నం తిని, 
ఎదుటి వారి పాపాలను తీసుకొని వెళతారు. 
డబ్బులు తీసుకొని కాదు. 
తన భక్తుల ఆకలి తీర్చినందులకు భగవంతుడు 
మిక్కిలి సంతసించి వెంటనే తగు పుణ్యమును 
మన జమలో వేసేస్తాడు. 
మన పాప కర్మ తొలగిపోతుంది.

మహానుభావులకు బుద్ధి ప్రచోదనం చేయిస్తాడు భగవంతుడు నీ కర్మ తొలగించడానికి. 
నీ పాప కర్మ తొలగించడానికి..
వారు నీ ఇంటికి వెతుక్కొంటూ వస్తారు. 
నీవు పెట్టె పట్టెడు అన్నంతో నీ జన్మ జన్మల పాపాన్ని అంతా వాళ్ళు తీస్తారు. 

నీవు పెట్టె పట్టెడు మెతుకుల కోసం వారు రారు. 
మరలా నీవు రమ్మని బ్రతిమలాడినా రారు. 
అది ఆ సమయములోనే అంతే. 
ఒకసారి కాదనుకొన్నావా మరలా తిరిగి రాదు. 

ఇంటి ముందుకు వచ్చిన గోమాత కూడా అంతే, 
నీ పాపాలు అన్నీ తీసుకొని వెళుతుంది 
నీవు పెట్టిన ఒక్క అరటి పండుతో. 

జాగ్రత్త.
అమ్మా అన్నం పెట్టు తల్లీ అని అడిగినవానికి 
లేదనకుండా వున్నది పెట్టండి, 
మీ తరతరాలను ఆశ్వీరదించి వెళతాడు. 
తిండి దొరకక రారు ఎవ్వరూ నీ ఇంటికి.  
కావున తల్లులారా, “అమ్మా అన్నం పెట్టు”... 
అని అడిగిన వారికి పరిగెత్తుకొని ఎన్ని పనులున్నా మానుకొని పెట్టండి. 

ఇంటికి వచ్చిన గోమాతను ఖాళీ కడుపుతో పంపకండి. వెంటనే మీకు శుభ ఫలితం కనిపిస్తుంది.
ఓం నమః శివాయ..!!

లోకా సమస్తా సుఖినోభవంతు..!!