8, మార్చి 2023, బుధవారం

🍎కాయ?పండు?🍎

*కాశీ కి వెళితే...***
*కాయో పండో వదిలేయాలి అని పెద్దలు అంటారు...అందులో మర్మమేమిటి...?* 

అసలు శాస్త్రం లో 
ఎక్కడ కూడా.. 
కాశీ కి వెళితే 
కాయో, పండో వదిలేయాలి 
అని చెప్పలేదు..

శాస్త్రం చెప్పిన విషయాన్ని.. 
కొందరు తెలిసీ తెలియని విషయ పరిజ్ఞానం తో కొంచం వాళ్లకు అనుకూలంగా మార్చు కున్నారు.

కాశీ క్షేత్రం విషయంలో శాస్త్రము చెప్తున్నది ఏమిటి అంటే... 
కాశీ వెళ్లి గంగ లో స్నానం చేసి 
"కాయా పేక్ష మరియు ఫలా పేక్ష" ను
గంగలో వదిలి,
ఆ విశ్వనాథ దర్శనం చేసుకొని ఎవరి ఇళ్ళకు వాళ్ళు తిరిగి వెళ్ళాలి అని.

*ఇక్కడ...*

కాయాపేక్షా,
ఫలాపేక్ష
అన్నారు...
అంటే...
ఈ కాయము పై
(శరీరము పై అపేక్షని ) ,

ఫలా పేక్షా 
(కర్మ ఫలము పై అపేక్ష ని)
పూర్తిగా వదులు కొని...
కేవలం నిజమైన భక్తితో ఆ ఈశ్వర చింతన కలిగి ఉండమని పెద్దలు చెప్పారు.

*కాలక్రమేణా...*

అది కాస్తా 
కాయ, పండు  
గా మారి పోయింది.

*అంతే కానీ...*  

కాశీ వెళ్లి ఇష్టమైన 
కాయ గూరలు,
తిండి పదార్థాలు 
గంగ లో వదిలేస్తే...
మనకు వచ్చు భక్తి కానీ,
అందులో నిజమైన
పుణ్యం ఎం ఉంటుంది.

*కనుక...*

శాస్త్రం నిజంగా 
ఎలా చెప్తుందో 
అర్థం చేసుకొని... 
ఆ క్షేత్ర దర్శనము, 
ఆ సంప్రదాయం పాటిస్తే..
నిజమైన ఆధ్యాత్మిక చైతన్యం వస్తుంది...
అంతే కాని 
మామిడి పండుని, వంకాయ ని గంగలో వదిలేస్తే వచ్చే ఉపయోగం ఏమి ఉండదు.

*కనుక...*

*ఈసారి మీరు కాశీ వెళితే...*

మనకి శత్రువులు అయిన
ఈ శరీరం పై 
ఎక్కువ ప్రేమని, 
మనం చేసే కర్మల మీద లేనిపోని కర్మఫలం అపేక్ష ని మాత్రమే వదులుకొని...
ఆ విశ్వనాథ దర్శనం చేసి, 
నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం కలగాలి అని ప్రార్దిదాం ......*****

5, మార్చి 2023, ఆదివారం

🛕విష్ణు పాద దేవాలయం 🛕


ఈ ఆలయం మధ్యలో విష్ణువు పాదముద్రలతో నిర్మించబడిందని నమ్ముతారు.🎊

విష్ణుపాద దేవాలయం



🌸విష్ణుపాద దేవాలయం ( విష్ణువు యొక్క పాదాల ఆలయం) భారతదేశంలోని గయ, బీహార్, ఫాల్గు నది ఒడ్డున ఉన్న విష్ణువు కి అంకితం చేయబడిన పురాతన హిందూ దేవాలయం. విష్ణువు గయాసురుడు అనే రాక్షసుడిని సంహరించి భూగర్భంలో బంధించిన ప్రదేశంలో ఈ ఆలయం నిర్మించబడిందని నమ్ముతారు.

🌸ఈ ఆలయంలో పెద్ద పాదముద్ర ఉంది, ఇది విష్ణు భగవానుడిది అని చెప్పబడింది. ధర్మశిల అని పిలువబడే బసాల్ట్, దేవత గయాసురుడిని భూగర్భంలోకి పిన్ చేసే ముందు అతని ఛాతీపై అడుగు పెట్టినప్పుడు నిలుపుకుంది.

చరిత్ర:
🌸ఒకసారి గయాసురుడు అని పిలువబడే ఒక రాక్షసుడు తీవ్రమైన తపస్సు చేసాడు మరియు అతనిని చూసేవాడు మోక్షం ( మోక్షం ) పొందాలని వరం కోరాడు. ఒకరి జీవితకాలంలో నీతిమంతుడిగా ఉండటం ద్వారా మోక్షం లభిస్తుంది కాబట్టి, ప్రజలు దానిని సులభంగా పొందడం ప్రారంభించారు.

🌸అనైతిక ప్రజలు మోక్షాన్ని పొందకుండా నిరోధించడానికి, విష్ణువు గయాసురుడిని భూమి క్రిందకు వెళ్ళమని కోరాడు మరియు అతని కుడి పాదాన్ని అసురుడి తలపై ఉంచాడు. గయాసురుడిని భూ ఉపరితలం క్రిందకు నెట్టివేసిన తరువాత, విష్ణువు యొక్క పాదముద్ర ఇప్పటికీ మనకు కనిపించే ఉపరితలంపై అలాగే ఉంది. పాదముద్ర శంకం, చక్రం మరియు గాధంతో సహా తొమ్మిది విభిన్న చిహ్నాలను కలిగి ఉంటుంది.ఇవి స్వామివారి ఆయుధాలని నమ్ముతారు. గయాసురుడు ఇప్పుడు భూమిలోకి నెట్టబడ్డాడు ఆహారం కోసం వేడుకున్నాడు. విష్ణువు అతనికి ప్రతిరోజూ ఎవరైనా ఆహారం ఇస్తారని వరం ఇచ్చాడు. 

🌸ఎవరైతే అలా చేస్తే వారి ఆత్మలు స్వర్గానికి చేరుకుంటాయి. గయాసురుడికి ఆహారం లభించని రోజు బయటకు వస్తాడని నమ్మకం. ప్రతిరోజూ, భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఒకరు లేదా మరొకరు అతని నిష్క్రమించిన వారి క్షేమం కోసం ప్రార్థిస్తారు మరియు గయాసురుడికి ఆహారం ఇస్తారు.

🌸 1787లో ఫల్గునది ఒడ్డున ఇండోర్ పాలకుడైన దేవి అహల్యా బాయి హోల్కర్ ద్వారా ప్రస్తుత నిర్మాణాన్ని పునర్నిర్మించారు. అహల్యాబాయి హోల్కర్ ఆలయాన్ని రూపొందించారు, మొత్తం ప్రాంతంలో ఆలయానికి ఉత్తమమైన రాయిని పరిశీలించడానికి మరియు కనుగొనడానికి ఆమె అధికారులను పంపారు, చివరకు వారు జయనగర్ లో ముంగర్ నల్ల రాయిని ఉత్తమ ఎంపికగా గుర్తించారు.

🌸సరైన రహదారి లేకపోవడం మరియు పర్వతాలు గయ నుండి చాలా దూరంలో ఉన్నందున, అధికారులు మరొక పర్వతాన్ని కనుగొన్నారు, ఇక్కడ వారు రాయిని చెక్కి సులభంగా గయకు తీసుకురావచ్చు. ఆ ప్రదేశం బథాని ( గయా జిల్లాలోని ఒక చిన్న గ్రామం ) సమీపంలో ఉంది. అధికారులు రాజస్థాన్ నుంచి కళాకారులను తీసుకొచ్చారు.

🌸వారు పథర్కట్టి (ఒక గ్రామం మరియు బీహార్లోని ఒక పర్యాటక ప్రదేశం)లో ఆలయాన్ని చెక్కడం ప్రారంభించారు. చివరి ఆలయం విష్ణుపాద ఆలయ స్థలానికి సమీపంలోని గయలో ముగించారు. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత చాలా మంది హస్తకళాకారులు తమ స్వస్థలాలకు తిరిగి వచ్చారు.

🌸అయితే వారిలో కొందరు పట్టర్కట్టి గ్రామంలోనే స్థిరపడ్డారు. బీహార్ ప్రభుత్వం ఈ స్థలాన్ని బీహార్లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా గుర్తించింది. విష్ణుపాద మందిరానికి నైరుతి దిశలో బ్రాహ్మజ్ఞుని కొండపైకి వెళ్లే 1000 రాతి మెట్లు గయా నగరం మరియు పర్యాటక ప్రదేశం అయిన విష్ణుపాద ఆలయాన్ని చూడవచ్చు. ఈ ఆలయానికి సమీపంలో అనేక చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి.

🌸ఈ ఆలయం మధ్యలో విష్ణువు పాదముద్రలతో నిర్మించబడిందని నమ్ముతారు. హిందూమతంలో, ఈ పాదముద్ర విష్ణువు గయాసురుడిని అతని ఛాతీపై ఉంచి అణచివేసిన చర్యను సూచిస్తుంది. విష్ణుపాద మందిరం లోపల, విష్ణువు యొక్క అతి పెద్ద పొడవు గల పాదముద్ర గట్టి రాతితో ముద్రించబడింది. ఆలయం లోపల అమర మర్రి చెట్టు అక్షయవత్ ఉంది, ఇక్కడ మరణించినవారికి చివరి కర్మలు జరుగుతాయి. ఆలయం లోపల ఒక (గర్వ్ గిరి) వెండి పూతతో కూడిన షడ్భుజి రెయిలింగ్ (పహల్) అని కూడా పిలుస్తారు.

 

2, మార్చి 2023, గురువారం

అన్నపూర్ణ దేవి



అన్నపూర్ణ.. ఆకలితో ఉన్న వారెవరికైనా అన్నం పెట్టి ఆదరించమనే సందేశము అమ్మవారు మనకు ఇస్తుంది🍂

అన్నపూర్ణాదేవి 

🌺అన్నపూర్ణ అనగా పార్వతి కి మరోపేరు.అన్నపూర్ణ అంటే ఈశ్వరస్వరూపం. ఈశ్వరుని సతి కూడా .ఇంకా అన్నపూర్ణమ్మను లక్ష్మీ, సరస్వతుల రూపంగానూ కొలుస్తారు. సర్వమంగళకారిణి, అన్నపూర్ణామాతను పూజిస్తే సర్వవ్యాధులు, ఈతిబాధలు తొలగిపోతాయని పురోహితులు అంటున్నారు.జీవుల జీవాన్ని నియమింపజేసి, అనుగ్రహించే కరుణామయి, జగన్మాత అన్నపూర్ణాదేవి, అని ప్రశ్నోపనిషత్ చెప్తోంది.ఈ విషయాన్నీ, యజుర్వేద తైత్తిరీయ ఆరణ్యకం, బృహదారణ్యకోపనిషత్, భగవద్గీత మనకు అందచేస్తున్నాయి.

🌺శరన్నవరాత్రుల్లో అమ్మవారు.. ఓ రోజు.. అన్నపూర్ణ దేవిగా దర్శనమిచ్చింది.. అన్నపూర్ణ దేవి అంటే.. ఓ ఇల్లాలిగా.. ఓ తల్లిగా కుటుంబంలో మహిళకు ఉండే పాత్రను చాటిచెప్పే అవతారం.. అన్నపూర్ణ.. ఆకలితో ఉన్న వారెవరికైనా అన్నం పెట్టి ఆదరించమనే సందేశము…అమ్మవారు మనకు ఇస్తుంది. కుటుంబంలో తల్లిపాత్రకు…ఉన్న ప్రాథాన్యాన్ని…ఈ అవతారము మనకు బోదపడేలా చేస్తుంది.అన్నపూర్ణ దేవి శక్తిని, బుద్ధిని కూడా ఆమే ఇస్తుంది. ‘భిక్షాం దేహీ కృపావలంబన కరీ మాతాన్నపూర్ణేశ్వరి’ అని నిత్యం కొలిచిన వారికి ఈతిబాధలు ఉండవని పురాణాలు చెబుతున్నాయి.

🌺సకల ప్రాణులలో చైతన్య స్వరూపిణి అయి, ప్రాణులకు మంచి బుద్ధిని ప్రసాదించే బ్రహ్మ విద్యాస్వరూపిణి- అన్నపూర్ణాదేవి. అన్నము సమృద్ధిపరచుము, దీనిని వ్రతముగా పాటించాలి. అంటే, ఆహార ధాన్యాల్ని ప్రజలకందరకు సరిపోయేటట్లుగా సమృద్ధిగా దీక్షతో దక్షతగా కృషిచేసి పండించాలి. ఈ కృషిలో అందరూ పాలుపంచుకోవాలి. భూమియే- అన్నము. ఆకాశము అన్నాదము, అనగా భూమి నుండి అన్నమునకు సంబంధించిన పంట పండుతోంది. ఆకాశము భూమిపైగల జలమును సూర్యరశ్మి ద్వారా సేకరించి తిరిగి వర్షరూపమున పంటలకు అందించుచున్నది. భూమియందు ఆకాశము ఆకాశమునందు భూమి ప్రతిష్ఠితమవుతున్నాయి. ఇవి ఒకదానికొకటి అన్నము, అన్నాదులు. ఈ విషయాన్ని తెలుసుకున్నవాడు, అన్నపూర్ణాదేవి అనుగ్రహాన్ని పొందినవాడై, అన్నము, పుత్రపౌత్రాభివృద్ధి పశు సంపద బ్రహ్మవర్చస్సు కలిగి కీర్తిమంతుడవుతాడు.




🌺అన్నం ఎలా పుడుతుందనే విషయాన్నికూడా వేదం వివరించింది. పరబ్రహ్మతత్త్వమునుండియే ఆకాశము ఉద్భవించింది. ఆకాశమునుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్నినుండి జలము, జలమునుండి భూమి, భూమినుండి ఔషధులు (మొక్కలు) ఓషధులనుండి అన్నము, అన్నమునుండి ప్రాణి పుడుతున్నాయి. కనుక పురుషాది ప్రాణికోటి అన్నరసమయము. అన్నరసమయుడైన ఈ పురుషుడే ఆ పరమ పురుషుడు. అనగా పరబ్రహ్మతత్త్వము. ఈ విధముగా జీవబ్రహ్మైక్య స్థితిని ప్రసాదించే కరుణామయి. అన్నపూర్ణాదేవి.

🌺దీనులకు అన్నము ఉదకము దానము చేయుటం ధర్మము. దాన్ని ఆచరిస్తే, శ్రేయస్సు ఆరోగ్యము, సర్వశుభములు కలుగుతాయి. అన్న, ఉదక దానములకు మించిన దానము లేదని, అదే అన్నపూర్ణేశ్వరి ఆరాధన అని పేర్కొన్నది మహాభారతము.ప్రకృతి స్వరూపం- ఋతువులు. శక్తిస్వరూపమే ప్రకృతి. అన్నాన్నిచ్చి శారీరకంగా పుష్ఠివంతులుగా చేసేది, సద్బుద్ధి భిక్ష నొసగి జ్ఞాన పుష్టివంతులగా నొనర్చు కరుణామయి, విశేషంగా అర్చించబడు, మూల ప్రకృతి శక్తి- అన్నపూర్ణాదేవి.

🌺‘‘బిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ’’ అని ఆదిశంకరులు ప్రార్థించిన అన్నపూర్ణాష్టకం తప్పనిసరిగా పారాయణ చేయాలి.

🌺‘‘పూర్ణ మదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే’’ కనుపించనివన్నీ శక్తిచే నిండి ఉన్నాయి. కనిపించేవి అన్నీకూడా ఆ శక్తి చేత వ్యాప్తములై ఉన్నాయి. అఖిల ప్రపంచమూ ఆ పూర్ణ శక్తినుండే వచ్చింది. అయినా, ప్రపంచమంతా నీ నుండే వచ్చినా, ఇంకా ఆ శక్తి ‘పూర్ణమే’. ఆ పూర్ణశక్తియే ‘అన్నపూర్ణ’.

🌺దీపావళినాడు కాశీక్షేత్రంలో అన్నపూరాణ దేవిని, స్వర్ణ ఆభరణాలతో అలంకరించి దేవాలయాన్ని దివ్యకాంతులీనే దీపాలతో అలంకరిస్తారు. ‘కాశీ’ అంటే వెలుగు. అందుకే వారణాసికి కాశీ అని పేరు వచ్చింది. అనంతమైన విశ్వశక్తిని ఆకళింపు చేసుకొని, విశ్వమానవ కల్యాణాన్ని వీక్షించాలని చెప్తోంది, అఖిల భువనసాక్షి- అన్నపూర్ణాదేవి.